అకాల వర్షానికి నలుగురు రైతులు బలి

అకాల వర్షానికి పంటను కాపాడేందుకు వెళ్లి రేకుల షెడ్డు మీద పడటంతో నలుగురు రైతులు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు ఈదురు గాలులతో పెద్ద ఎత్తున వర్షం ప్రారంభమైంది. దీనితో కొనుగోలు కేంద్రాలలో, కల్లాలలో ఉన్న వడ్లకు తాటిపత్రిలు కప్పడానికి వెళ్లిన రైతులు మరణం పొందారు. కంపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల అభిరామ్ తణుకుల నాగరాజులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వర్షం పెద్ద ఎత్తున రావడంతో దగ్గరలో ఉన్న రేకుల షెడ్డు పక్కన గోడకు ఆనుకొని నిలబడ్డారు. దీనితో వర్షం పెద్ద ఎత్తున రావడం గాలి దుమారం లేవడంతో గోడ కూలింది. వీరిద్దరు కాకుండా కొత్తూరు కు చెందిన గుండారపు వెంకటేష్ ఇదే పనిపై వెళ్లి అదే గోడ పక్కన నిలబడ్డారు. దీనితో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్కి లచ్చన్న విషాదం మరో విధంగా ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Listings
News
Home
Jobs
Contact