రెండు రోజులుగా వేసవి ఎండ రుచి చూసిన ప్రజలు సోమవారం ఒక్క సారిగా మారినఅకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగమయ్యారు. సోమవారం మద్యాహ్నాం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకొని భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత రాలి పోయింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తిని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది.
