Breaking News

4942941cfef1b2bf5ca0ed9a5a090ba7
Breaking News

ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్.. డ్యూటీలో మొబైల్ వాడకంపై నిషేధం!

తెలంగాణలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు వ్యక్తిగత మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించేందుకు ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అత్యవసర సమయాల్లో స్పందించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపై అధికారిక సమాచార మార్పిడికి వీహెచ్‌ఎఫ్ (VHF) సెట్లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తే ట్రాఫిక్ పోలీసుల పనితీరు మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

hospital picsart aiimageenhancer (1)
Breaking News

టచ్ హాస్పటల్‌కు అంతర్జాతీయ గౌరవం

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రికి అంతర్జాతీయ గౌరవం దక్కిందని టచ్ ఆసుపత్రి నిర్వహాకులు మాటేటి శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. టచ్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్డియాలజిస్టు డాక్టర్ రాజేష్ బుర్కుండే మలేషియాలోని కౌలాలంపూర్ లో 2026 మే నెల 4,5 తేదిలలో జరుగనున్న 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్డియాలజీ అండ్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ లో స్పికర్‌గా ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిఫుణులు, పరిశోదకులు పాల్గోనడం జరుగుతుందన్నారు. భారత దేశం నుండి ప్రాతినిధ్యం వహించనున్న డాక్టర్ రాజేష్ కార్డియాలజీ రంగంలో తన అనుభవం, పరిశోధనలపై ప్రసంగం ఇవ్వనున్నారని వారు తెలిపారు.మంచిర్యాల పట్టణంలోని టచ్ ఆసుపత్రిలో వైద్యులు అనేక క్లిష్టమైన ప్రొసిజర్స్ విజయవంతం చేసి అనేక మంది రోగుల ప్రాణాలు రక్షించడం జరిగిందన్నారు. అడ్వాన్స్ క్యాత్ లాబ్ ద్వారా అనేక హృదయ సంబందిత అత్యవసర సేవలను విజయవంతంగా అందిస్తుందన్నారు. టచ్ ఆస్పటల్ వైద్యుడు రాజేష్ బుర్కుండే కు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించడం అభినందనీయమని వారు కొనియాడారు. డాక్టర్ రాజేష్ కు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. https://www.manatelangana.news/international-recognition-to-touch-hospital/

850430944eefeb9a02e29dade63db4b6
Breaking News

పెగడపల్లి పరిధిలో పెద్దపులి సంచారం

మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీ సమీప చేలల్లో పనిచేసేవారు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. పశువులు, గొర్రెల కాపరులు తదుపరి సమాచారమిచ్చే వరకు అడవిలోకి వెళ్లరాదన్నారు. పులి పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పంట పొలాల చుట్టూ కరెంట్ కంచెలు, ఉచ్చులు వేయరాదని సూచించారు.

6790d76a 6288 4341 ab52 3c93adc9f258
Breaking News

వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహం లభ్యం

మంచిర్యాల జిల్లా, ముల్కల్ల గోదావరి నది కి వెళ్లె రహాదారి ప్రక్కన వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహ ప్రతిమ బయటపడింది. ఇటీవల ముల్కల్ల గోదావరి తీరానికి అఘోరాలు, సాధువులు వచ్చిన క్రమంలో ఈ ప్రాంతంలో అమ్మవారి శక్తి ఉందని స్థానికులకు తెలపడంతో పాటు అమ్మవారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వెళ్లారు. దీంతో గ్రామస్థులు, పూజారులు గత రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టారు. పాత మంచిర్యాలకు చెందిన ఒక రైతుకు చెందిన భూమిలో తవ్వకాలు చేపట్టగా సోమవారం అమ్మవారి విగ్రహ పతిమ లభించింది. వెంటనే అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి నిలబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్ నుండి వచ్చిన సాధువులు ముల్కల్ల గోదావరి తీరప్రాంతంలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారి రాకతోఒక్కసారిగా ఏదో శక్తి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, వారు చెప్పడమే కాకుండా ఆ స్థలాన్ని గుర్తించి వెళ్లడంతో స్థానికులు, పూజారులు విగ్రహం కోసం తవ్వకాలు చేపట్టారు. స్వామీజీలు చెప్పిన ప్రదేశంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు చేపట్టారు. సోమవారం స్వామిజీలు చెప్పిన విధంగానే అమ్మవారి విగ్రహం భూమిలో లభించడంతో భక్తి పారవశ్యంతో ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముల్కల్ల గోదావరి తీరంలో అమ్మవారి వెలిసిందని తెలియండంతో చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. అప్పుడే అమ్మవారి గుడి కట్టేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. అమ్మవారి విగ్రహం లభించిన చోట గుడికట్టేందుకు భూ యజమానితో సంప్రదింపులు చేస్తున్నారు.

2122792 food poisoning at bellampal picsart aiimageenhancer
Breaking News

బెల్లంపల్లి గురుకుల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు భో జనం చేసిన తరువాత అస్వస్థతకు గురికావడంతో పుడ్ పాయిజన్ జ రిగి ఉంటుందనే వాదనలు వినవస్తున్నాయి. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి వసతి గృహాంలో విద్యార్థులు భోజనం చేసిన తరువాత 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులను బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఆసుపత్రి కి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చి కిత్స అందించారు. గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ గురుకులాలపై ప్రభుత్వ వైఖరీ తెలియజేస్తుందని విద్యార్థుల పేరేంట్స్ అన్నారు. గురుకులాలలపై సక్రమైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే తరచు పుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతుండడం దురధృష్టకరం, ఇప్పటికే పలు ప్రాంతాలలో గురుకులాలలో పుడ్‌పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చేరిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికి, బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో సంఘటన జరగడంనిర్లక్ష్యానికి దారితీస్తుందనడంలో ఏలాంటి సందేహాం లేదు.ఈ సంఘటన తెలిసిన ఎంఎల్‌ఎసి మల్క కొంరయ్య శనివారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించారు. పుడ్ పాయిజన్ సంఘటనను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో సంఘటన విషయమై ఛరవాణిలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బెల్లంపల్లి గురుకుల పాఠశాల లో జరిగిన పుడ్ పాయిజన్ విషయమై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేసారు. ప్రతి సారి గురుకుల పాఠశాలలో పుడ్‌పాయిజన్ ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు, అధికారుల పర్యవేక్షణ ఎందుకు కొరవడుతుందని, ఈ విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుడ్ పాయిజన్ సంఘటనపై రిపోర్టు హెల్త్ డైరెక్టర్ కు పంపాలని ఆయన ఆదేశించారు. గురుకులం ఘటనకు బాద్యులను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. విద్యార్థులకు ఏలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

lush green foliage and heavy rain creating a tranquil and refreshing natural scene photo
Breaking News

అకాల వర్షానికి నలుగురు రైతులు బలి

అకాల వర్షానికి పంటను కాపాడేందుకు వెళ్లి రేకుల షెడ్డు మీద పడటంతో నలుగురు రైతులు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు ఈదురు గాలులతో పెద్ద ఎత్తున వర్షం ప్రారంభమైంది. దీనితో కొనుగోలు కేంద్రాలలో, కల్లాలలో ఉన్న వడ్లకు తాటిపత్రిలు కప్పడానికి వెళ్లిన రైతులు మరణం పొందారు. కంపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల అభిరామ్ తణుకుల నాగరాజులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వర్షం పెద్ద ఎత్తున రావడంతో దగ్గరలో ఉన్న రేకుల షెడ్డు పక్కన గోడకు ఆనుకొని నిలబడ్డారు. దీనితో వర్షం పెద్ద ఎత్తున రావడం గాలి దుమారం లేవడంతో గోడ కూలింది. వీరిద్దరు కాకుండా కొత్తూరు కు చెందిన గుండారపు వెంకటేష్ ఇదే పనిపై వెళ్లి అదే గోడ పక్కన నిలబడ్డారు. దీనితో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్కి లచ్చన్న విషాదం మరో విధంగా ఉంది.

Listings
News
Home
Jobs
Contact