మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పోరేట్ స్ధానాలను హస్తగతం చేసుకుని కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. మున్సిపాలిటి నుంచి కార్పోరేషన్గా ఏర్పడిన 60 డివిజన్ స్దానాల్లో 44 స్దానాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు ఘన విజయం సాధించారు.బిఆర్ఎస్ 08,బిజెపి05, ఆల్ఇండియా ఫార్పర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 02, జన సేన పార్టీ01లు గెలుపొందారు. శుక్రవారం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఫలితాలు పోటి చేసిన అభ్యర్దులకు గెలుపు ఓటములపై టెన్షన్ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రతి రౌండ్లో వచ్చే ఓట్ల ఫలితాలు ఆందోళన కల్గించాయి. డివిజన్లోని 60 స్దానాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి, ఆల్ఇండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీ తో పాటు జనసేన పార్టీ నుంచి అభ్యర్దులు ఎన్నికల బరిలో పోటి చేశారు. కార్పోరేషన్ ఎన్నికల్లో 60 స్దానాల్లో 44 డివిజన్లలో కార్పోరేటర్లుగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వారు వీరే…..01,02,03 డివిజన్ల నుంచి శ్రీపతి కవిత శ్రీనివాస్,పుట్ట యశోద, పత్తి ప్రకృతి,07వ డివిజన్ వేల్పుల రవీందర్,09,10,11 డివిజన్లలో సురిమెళ్ల సౌమ్య, రాజకొండ గోపాల్, సుధమల్ల హరికృష్ణ,14,15,16,17,18,19,20,21,22 డివిజన్ల నుంచి తూముల నరేష్, చింతపండు శ్రీనివాస్, బియ్యాల త్రివేణి, లగిశెట్టి రాజయ్య, రాచమల్ల కమల, కాకుల వరలక్ష్మి, గంగవరపు వెంకటేశ్వర్లు, జోగుల సదానందం,రోజ కంకణాల,24వ డివిజన్ నుంచి బొడ్డు స్వప్న,29,30,31,32,33 డివిజన్లలో బండారి సుధాకర్,కర్రె శ్రీనివాస్,తాళ్ల సంపత్,ధరణి మధుకర్, ఎంబడి కుమార స్వామి,35,36,37,38,39,40,41,42,43,44వ డివిజన్ల నుంచి మర్రి శ్రీలత,అగల్ డ్యూటీ రాణి,మహమ్మద్ ఖలీద్,పూదరి విజయ, పూదరి సునీత,ఆది శశికళ,షేర్ శ్రీలక్ష్మి,చిందం సత్యవతి,చిలువేరు జ్యోతి,కోమాకుల కిషన్,46వ డివిజన్ నుంచి పెంట రజిత,48వ డివిజన్ నుంచి వేములపల్లి లక్ష్మీదుర్గ, 51,52,53,54,55,56 డివిజన్ల నుంచి నీలి స్వప్న, వీరమనేని స్రవంతి, మహమ్మద్ నూర్జహాన్ బేగం, సల్ల రమ్య, గాండ్ల సత్యమ్మ, నల్ల శంకర్,59,60 డివిజన్లలో మాదంశేట్టి సత్యనారాయణ, ఆఫ్రీన్ సుల్తానాలు ఉన్నారు. 04,13,23,28,45,47,49,50 డివిజన్లలో గుమ్మడి శ్రీను, వనరాశి నంబయ్య, కర్రు శంకర్, అమృతరాజ్ కుమార్,దోమల సునీత, కల్వల వెంకటసాయకృష్ణ, అబ్దుల్ సత్తార్, పెట్టం స్వరూప బిఆర్ఎస్ పార్టీల నుండి గెలుపొందారు. అలాగే 05,06,12,57,58 డివిజన్లలో తోటపల్లి రాజేశ్వరి,వనపర్తి కేత, గాజుల ముఖేశ్ గౌడ్, బొట్ల అనితలు బిజెపి నుండి గెలుపొందారు. కాగా ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 8 వ డివిజన్ మేకల రమేష్,26 డివిజన్ రవిలు గెలుపొందగా జనసేన పార్టీ నుండి 34వ డివిజన్లో పోటి చేసిన సాగర్ గెలుపొందారు.